Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

AGULU

Original price was: ₹600.00.Current price is: ₹499.00.
Next

SINGLE RUDRAKSHA WITH SILVER CAP

Original price was: ₹1,200.00.Current price is: ₹999.00.
Next Product Image

PANCHA VANARU MISRAMAM

Original price was: ₹999.00.Current price is: ₹499.00.

పంచ వనరు మిశ్రమం : ఈ పంచ వనరు మిశ్రమంలో తెల్లావాలు , మిరియాలు , విష ముష్టి గింజలు , పిప్పళ్లు , శొంఠి అనే 5 శక్తివంతమైన వనరులు ఉంటాయి . వ్యక్తులకు లేదా గృహానికి లేదా వ్యాపార సముదాయానికి ప్రాప్తించిన ఏ నెగిటివ్ ఎనర్జీని అయినా ఈ వనరు క్రమంగా తొలగించగలదు . వ్యక్తులకు అయితే ఈ వనరు ఒక పళ్లెంలో పోసుకుని సూర్యాస్తమయం తరువాత దృష్టి తీసుకుని నిప్పుల్లో లేదా ఎవరూ తొక్కని ప్రదేశాలలో పారవేయాలి. అదే గృహం లేదా వ్యాపార స్థలానికి అయితే ఎర్ర వస్త్రం లో మూటగా కట్టి గుమ్మం బైట వైపు వ్రేలాడదీయాలి . ఇది అంగిర మూల మంత్రం తో శక్తి క్రియ నిర్వహించబడిన ద్రవ్యం .

Description

సాధారణంగా ఎవరికైన దృష్టి లేదా వాడుక భాషలో దిష్టి తగిలితే మన పెద్దలు ఎండుమిరపకాయలు , ఉప్పు , నిమ్మకాయలు , కోడి గ్రుడ్డు , ఎర్ర నీరు ( వసంతం ) , నూనె లో నానబెట్టిన వస్త్రం ఇలాంటివి దిగదుడిచి పారవేస్తారు . దానివల్ల దృష్టిదోషం తొలగుతుంది అని చాలామంది నమ్మకం . కానీ దృష్టి దోష తీవ్రతని బట్టి ఏఏ పదార్ధాలు ఉపయోగించాలో చాలామందికి తెలియదు , కేవలం వారి పెద్దలు అలా చేశారు కనుక వారు కూడా అదే పధ్ధతి ఆచరిస్తున్నాము అని వారి భావన . ఈ పద్దతి పూర్తి ఆమోదయోగ్యం కాదు . ఒక వస్తువుని దృష్టి దోష నివారణకు ఉపయోగించే ముందు ఆ వస్తువు అలా పనిచేయడానికి సిద్ధపరచాలి . కేవలం ఇందాకా సూచించిన వస్తువులు స్వతః సిద్ధంగా దృష్టి దోష నివారణకు పనిచేయవు , వాటిని అభిమంత్రించి ఉపయోగించడం వల్ల మాత్రమే అవి ఆయా పనులను సక్రమంగా నిర్వహించగలుగుతాయి . చిన్న పిల్లల లగాయతు ఎవరికైనా దృష్టి దోషాలు తొలగింపజేయడానికి శాస్త్రం కొన్ని పదార్ధాలను ప్రత్యేకంగా సూచించడం జరిగింది . అవి తెల్లావాలు , మిరియాలు , పిప్పళ్లు , శొంఠి , విష ముష్టి గింజలు వీటిని పంచ వనరులు అంటారు . ఈ పంచ వనరులను అభిమంత్రించి ( శాబరీ మంత్రాలతో లేదా శూలినీ మూలంతో ) దృష్టి దోషములు తొలగించడానికి వినియోగించడం వల్ల సరైన ఫలితాలను అందించి దృష్టి దోషములు సంపూర్ణంగా తొలగించగలుగుతాయి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ప్రతీ నెలా నైమిత్తికాలలో ( శుద్ధ అష్టమి , బహుళ అష్టమి , పున్నమి , మాస శివరాత్రి రోజుల్లో ) శూలినీ మరియు శాబరీ మంత్రాలతో అభిమంత్రించి ఈ పంచ వనరుల మిశ్రమం దృష్టి దోష నివారణ కొరకు సిద్ధపరచడం జరుగుతుంది . ఈ మిశ్రమం మీరు మరలా అభిమంత్రించనవసరం లేదు . వినియోగించాలి అనుకునే రోజు సూర్యాస్తమయం తరువాత దిగదుడచాల్సిన వ్యక్తిని తూర్పుగా లేదా ఉత్తరంగా తిరిగి కూర్చోమని వారికన్నా పెద్దవాళ్ళు దృష్టి దోష మిశ్రమ ద్రవ్యాన్ని చేతిలోకి తీసుకుని తల చుట్టూ సవ్యంగా 9 సార్లు , అపసవ్యంగా 9 సార్లు దిగదుడిచి అవకాశం ఉంటే రాజేసిన నిప్పుల్లో వేయాలి , లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి . ఇలా కనీసం వారానికి ఒకసారి దిగదుడచడం వల్ల దృష్టి దోషాలు క్రమంగా శాంతించి నెగిటివ్ ఆరా తొలగి ప్రశాంతత చేకూరును .

Additional information

Weight 250 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews